ప్రముఖ సినీ నటుడు, సామాజిక వేత్త సోనూ సూద్ అంటే చాలా మందికి ఇష్టం. లాక్ డౌన్ టైమ్ లో ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు ఎన్నో రకాల సహాయాలు చేసి వారి అభిమానాన్ని చూరగొన్నారు. మరి అటువంటి సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తే అనేక మందికి మేలు జరుగుతుందని ప్రజలు అభిలాషించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Blood Cells: ఒంట్లో రక్తం పెరగడానికి మంచి మార్గం ఇదీ..! ఇంట్లో ఉంటూనే 3 నెలల్లో బలంగా మారొచ్చు..!!
సోనూ సూద్ త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారని ఆ వార్త సారాంశం. అది కూడా 2022లో ముంబై ఎన్నికల్లో ఆయన మేయర్ గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ రేసులో మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్రావు దేశ్ముఖ్ కొడుకు, నటుడు రితేష్ దేశ్ముఖ్, మోడల్, ఫిట్నెస్ పర్సనాల్టీ మిలింద్ సోమన్, ఇంకో సోనూ సూద్ ఉన్నట్లుగా చెప్పింది. ఆ ముగ్గురిలో ఒకరు మేయర్ గా ఉంటారని అర్థం అవుతోంది. దీనిపై సోనూ సూద్ రియాక్ట్ అయ్యారు. తాను సాధారణ వ్యక్తిలాగానే ఉంటానని తెలిపాడు.