లాక్ డౌన్ నాటినుండి ఇప్పటివరకూ తన సేవలు అందిస్తూనే ఉన్నాడు సోనుసూద్. లాక్ డౌన్ సమయంలో.. అప్పట్లో వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఆగిపోయినా క్రమంలో ప్రభుత్వాలు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో సోనుసూద్ తన సొంత డబ్బులతో ప్రత్యేకమైన బస్సులు ట్రైన్ లు ఏర్పాటు చేసి అనేకమందిని గమ్యస్థానానికి చేర్చటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
దీంతో చాలామంది సెలబ్రిటీలు దేశ వ్యాప్తంగా అనేక మంది సినిమా హీరోలు ఉన్నాగాని సరైన టైంలో సహాయాన్ని అందించి నిజమైన హీరో అనిపించుకున్నాడు సోషల్ మీడియాలో ఆయనపై ప్రేశంసల వర్షం కురిపించారు. కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా సోనూసూద్ అనేక మంది పేద వాళ్ళని ఆదుకుంటూ చదివిస్తూ కొంత మందికి ఉద్యోగాలు చూపిస్తూ మరికొంత మందికి ఉపాధి దొరికేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో పేద విద్యార్థులకు ఇటీవల 100 స్మార్ట్ ఫోన్లు ఆన్లైన్ తరగతులు కోసం అందించడం జరిగింది. విద్యా వ్యవస్థలో చాలావరకు మార్పులు రావడంతో పరిస్థితులు కూడా బయట అంతా అనుకూలంగా లేకపోవడంతో పేద విద్యార్థులు చాలావరకు విద్యకు దూరమవుతున్నారు. విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న తరుణంలో పేద కుటుంబాలు కనీసం స్మార్ట్ ఫోన్ లు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో సోనుసూద్ అలాంటి వారికి సాయం అందించడంతో.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.