Sonu Sood: సోనుసూద్ దేశవ్యాప్తంగా కరోనా వచ్చిన స్టార్టింగ్ నుండి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు లాక్ డౌన్ గత ఏడాది విధించిన నాటి నుండి.. సోను సూద్ తన సొంత డబ్బులతో అనేక మంది పేదవాళ్ళు ఆదుకోవటం మాత్రమే కాక.. అప్పట్లో వలస కూలీల ను.. స్పెషల్ ఫ్లైట్ లో ట్రైన్ లో.. అదే రీతిలో బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది.
ఏ రీతిగా ఎంతోమందిని ఆదుకున్న సోనూసూద్.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో తనకంటూ సపరేట్ టీమ్ లు.. ఏర్పాటు చేసుకుని పేదవాళ్లకు చదువుతోపాటు ఉద్యోగాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ముఖ్యంగా కరోనా చికిత్స విషయంలో కీలకంగా ఉండే ఆక్సిజన్ సిలిండర్లు .. కరోనా సెకండ్ వేవ్ ఇటీవల వచ్చిన సమయంలో అనేక రాష్ట్రాలలో అందుబాటులోకి తీసుకువచ్చి.. చాలా మంది ప్రాణాలను సోనూసూద్ కాపాడటం జరిగింది.
Read more: Sonu Sood: కరోనా విషయంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సోనుసూద్..!!
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా.. పేద పిల్లల కోసం .. చదువు పరంగా వారిని పైకి తీసుకురావడం కోసం.. గొప్ప అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. మేటర్ లోకి వెళ్తే సీఏ చదవాలనుకునే పేద పిల్లల కోసం ఫ్రీగా కోచింగ్ అందిస్తామని తాజాగా స్పష్టం చేశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎం ఫ్రీ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నామని.. ఇంటర్న్షిప్ తో పాటుగా ప్లేస్మెంట్ లు కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు. ట్రస్ట్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి అని సోషల్ మీడియా ద్వారా సోనూసూద్ తెలియజేశారు.