Sonu sood: కరోనా నేపథ్యంలో సినీనటుడు సోను సూద్ అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది లాక్ డౌన్ అమలు చేసిన నాటి నుండి … అనేకమందికి సహాయపడుతూ సోను సూద్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని కోట్లు రెమ్యనరేషన్ వసూలు చేసే టాప్ హీరోలు చాలా మంది ఉన్నా గాని.. ఎవరూ కూడా సోను సూద్ ప్రజలను ఆదుకున్న రీతిలో.. ఆదుకోలేదు.
వలస కార్మికుల నుండి కరోనా బారిన పడిన రోగులను అదే రీతిలో అనేక మంది పేద వాళ్ళని.. సోను సూద్ అండ్ టీం కాపాడడం జరిగింది. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న టైమ్ లో… చాలామంది కరోనా బారిన పడి ఆక్సిజన్ అందక మరణిస్తూ ఉన్న టైంలో..సోను సూద్.. ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి ఆదుకోవడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్ లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దేశంలో మొట్టమొదటిగా అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో భాగంగా ఏపీలో నెల్లూరు జిల్లాలో సోనూసూద్ ఏర్పాటు చేయడం జరిగింది.
Read more: Sonu Sood: పేద విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సోనుసూద్..!!
ఈ సందర్భంగా నిన్న ఆక్సిజన్ ప్లాంట్ కి సంబంధించి ట్రక్కు నెల్లూరు జిల్లా లోకి ఎంట్రీ ఇవ్వడంతో జిల్లా ప్రజలు.. సోను సూద్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి పాలాభిషేకాలు హారతి ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ వల్ల ఇంకా ఎవరికి ప్రాణాపాయం ఉండదు అని తాజాగా వారు చూపిన అభిమానానికి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి సోను సూద్ నెల్లూరు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ కి సంబంధించిన పరికరాలు వచ్చిన ట్రాక్ కి జిల్లా ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు.