కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సినీ నటుడు సోను సూద్ ఎంతో మంది జీవితాలకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. ఒక రియల్ హీరో లాగా ఆపదలలో ఉన్నవాళ్ళకి చేయూతనిచ్చాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలు సైతం చేయలేని పనులను సోను సూద్ చేశారు. నిరుపేద కుటుంబాలకు సహాయం చెయ్యడం, నిత్యావసర సరుకులను పంపిణి చెయ్యడం, వలస కార్మికులను వారి ఊళ్లకు క్షేమంగా ఖర్చు లేకుండా పంపించేందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు.
కరోనా వల్ల ఒక దేశం నుంచి మరో దేశానికీ రాకపోకలు నిలిచిపోవడంతో విదేశాలలో చిక్కుకుపోయిన వారికి ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేశారు. విద్య, వైద్య ఖర్చులు భరించలేని పలువురి నిరుపేదలకు తాను సహాయం చేసాడు. ఎవరికి ఏ సహాయం కావాలో వాళ్ళు అడగగానే ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా తన వంతు సహాయం చేశారు. కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలు కూడా ఈ పనులు చేయలేకపోయారు.
ఇలా ఆయన వెనకాడకుండా సహాయం చెయ్యడంతో సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఫిదా అయిపోయారు. ఇది ఇన్ని రోజులుగా మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ మనకి తెలియని విషయం ఏమనగా ప్రజలకు తన వంతు సహాయం చెయ్యాలి అనే ఆలోచనతో సోను తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టారని తెలుస్తుంది.
రూ. 10 కోట్లను పోగు చేయడం కోసం ఆయన ముంబైలో తనకు ఉన్న ఎనిమిది ఆస్తులను తాకట్టు పెట్టారట. ఇందులో ఆరు ఫ్లాట్లు మరియు రెండు దుకాణాలు ఉన్నట్లు సమాచారం. ఈ రోజుల్లో ఎవరో తెలియని వాళ్ళకి కూడా సహాయం చేస్తునందుకు సోను సూద్ రీల్ హీరో నే కాదు రియల్ హీరో అంటూ సోను సూద్ అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.