Sonu Sood: కరోనా కష్టకాలంలో అనేకమందిని సోను సూద్ ఆదుకోవటం తెలిసిందే. సెకండ్ వేవ్ కారణంగా కరోనా ట్రీట్ మెంట్ విషయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి.. సకాలంలో ఆక్సిజన్ అందక మరణించడం జరిగింది. ఆ సమయంలో సోను సూద్ టీం ఆక్సిజన్ సిలిండర్లు అనేకమందికి ఏర్పాటు చేయడం మాత్రమే కాక కొన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్ లు కూడా ఏర్పాటు చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రీతిగా దేశంలో అనేక రాష్ట్రాలలో కరోనా రోగులను.. ఆదుకున్న సోనుసూద్ టీం ఇప్పుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విషయంలోకి వెళితే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 21వ తారీకు నుండి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా టీకా మందులు రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న సంగతి తెలిసిందే.
Read More: Sonu Sood: సోనూసూద్ కాస్ట్లీకారు కథ ! అసలు మ్యాటర్ ఇదంట!!
పరిస్థితి ఇలా ఉండగా దేశంలో కొన్ని మారుమూల గ్రామాల్లో కనీసం రవాణా వ్యవస్థ కూడా లేని వంటి చోట్ల కరోనా వ్యాక్సిన్ వెయ్యాలని తాజాగా సోనూసూద్ టీం డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సోను సూద్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దేశంలో మారుమూల గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు ఆ ప్రాంతాలలో.. వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు.