సక్సస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. లాక్ డౌన్ కి ముందు దాదాపు సగ భాగం టాకీపార్ట్ కంప్లీఅటయిన ఈ సినిమా రీసెంట్ గా చిత్రీకరణ మొదలైంద్దని సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుండి మెగాస్టార్ కూడా ఆచార్య సెట్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల ప్రధాన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆచార్య సినిమాలో సోనూ సూద్ పోషిస్తున్న కీలక పాత్ర కి సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీటయిందట. సోనూ సూద్ గత పది రోజుల గా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం సోనూ సూద్ కి సంబంధించిన పార్ట్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సోనూ పాత్ర చిన్నదే అయీనా చాలా కీలకమని అంటున్నారు. అంతేకాదు కొరటాల ఆచార్య చిత్రీకరణని ఎంత స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నాడో తాజాగా సోనూసూద్ పాత్ర కంప్లీట్ అవడాన్ని బట్టే అర్థమవుతోంది.
కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ రెజీనా మెగాస్టార్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఆ సాంగ్ కూడా ఇంతకముందు జరిగిన టాకీ పార్ట్ తోపాటే కంప్లీట్ చేశారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ సూపర్ ఫాం లోకి వచ్చిన మెలోడి బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తాడని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.