Sonusood: కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులకు విశేషంగా సహాయపడిన సోనూసూద్ ఎన్నో ప్రశంసలు పొందాడు. కేవలం వలస కార్మికులకు కాకుండా వేరే దేశాలలో చిక్కుకున్న భారతీయులకి, మన దేశంలో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతోమంది దాతలను ఉత్తేజపరచాడు సోనుసూద్.
సోనూ సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. అలాగే లో రెండవ వేవ్ లో తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ పూర్తిగా కోలుకున్న తర్వాత మరలా తన సేవా కార్యక్రమాలను మొదలుపెట్టాడు. ఈసారి అధిక స్థాయిలో తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికో ‘లేదు‘ అని అనకుండా తనవంతు సాయం అందిస్తున్నాడు.
ఉత్తర భారతీయుడైన సోను సూద్ మంచి మనసుకి దక్షిణాది భారతీయులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అతనిని దేవుడిగా కొలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి టౌన్ లో సోనూసూద్ అభిమానులు చేసిన పని దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.
సోనుసూద్ పెద్ద సైజు ఫోటో ఒకటి తయారు చేయించి దానికి పెద్ద మాల వేసి అతనికి పాలాభిషేకం చేశారు. దీన్ని ఒఅక్ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేయగా దేశవ్యాప్తంగా ఆ ఇమేజ్ వైరల్ అయిపోయింది. ఇక దీనికి సోను సూద్ కూడా స్పందించాడు. వారు ప్రదర్శించిన పనికి, ఇచ్చిన ప్రేమకు, తనకు దక్కుతున్న గౌరవానికి ఎప్పుడూ వినమ్రుడినై ఉంటానని ఒకే ఒక్క పదం లో తెలపడం విశేషం.
ఇకపై సోనూసూద్ ఇలాగే తన శక్తికి మించి సేవా కార్యక్రమాలు చేస్తూ పోతే రేపో మాపో నోబెల్ బహుమతి కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
Humbled ?? https://t.co/aQPOskdHgz
— sonu sood (@SonuSood) May 20, 2021