ప్రపంచంలో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక పరిస్థితి డేంజర్ లో పడటం జరిగింది. ఇదిలా ఉండగా రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్ దేశంలో లో ఆకలి కేకలతో చావులు నెలకోన బోతున్నట్లు టాక్ వస్తుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి ప్రజల కార్యకలాపాలు తగ్గాయి.
అదే సందర్భంలో ఆ దేశంలో వ్యాక్సిన్ అనవసరం అంటూ చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయటంతో సెకండ్ వేవ్ ఉన్న కొద్దీ సీరియస్ అయింది. ఈ దెబ్బతో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో తోడు థర్డ్ వేవ్ రావటమే కాక చాలా మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ కఠినం అయ్యే పరిస్థితులు దాపరించడం తో దేశ ప్రజలంతా భయంతో వస్తువులన్నీ కొనేయడం మాత్రమే కాక బియ్యం పప్పులు ఉప్పులు ఆహారధాన్యాలు కొనడంతో..బ్రిటన్ లో రాబోయే రోజుల్లో ఆహారపు కొరత గ్యారెంటీ అని తాజా పరిణామాలపై అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది. అవసరానికి మించి బ్రిటన్ దేశస్థులు ఆహారపు సరుకులు నాలుగింతలు కొనడంతో ఈ పరిస్థితి ఆ దేశంలో నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.