దిగ్గజ దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. మధ్యాహ్నం 1:04 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. గత నెల 5న కరోనా సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు.
అయితే అదే నెల 13న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్పటినుండి ఆరోగ్యం కొంత మెరుగుపడుతూ వస్తుండగా కరోనా నుండి కూడా కోలుకున్నారు. అయితే నిన్న సాయంత్రం ఆయన ఆరోగ్యం విషమించిందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. కరోనా నుండి కోలుకున్నా కానీ ఆయనకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గలేదు. వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గత 50 ఏళ్ల నుండి తన సంగీతంతో అలరిస్తూ వస్తున్న ఎస్పీ గానం ఇక వినలేము అనడం నిజంగా జీర్ణించుకోలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం.