భారత దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ బారి నుండి బయటపడ్డారు. తాజాగా చేసిన టెస్టులో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. ఎస్పీ బాలుకు కరోనా వైరస్ సోకడంతో ఈ నెల 5న చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే.
అప్పటినుండి బాలు అక్కడే చికిత్స పొందుతున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతుడినై తిరిగి వస్తానని బాలు అప్పుడు విశ్వాసం వ్యక్తం చేసారు. అయితే ఈ నెల 14న ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాలసుబ్రహ్మణ్యంను ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై ఉంచారు.
ఆయన కోలుకోవాలని ప్రముఖ సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ప్రార్ధించారు. విదేశీ వైద్యుల సహాయంతో ఆయన ఎక్మో సపోర్ట్ తో కోలుకుంటున్నారని అని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.