Spacex: అంతరిక్ష ప్రయాణాలను ఇప్పుడు వ్యోమగాములు చాలా ఈజీగా చేసేస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణమంటే చాలా సరంజామా అవసరం ఉండేది. అన్ని సర్ధుకున్నాక కూడా ప్రయాణాలు అనుకోని కారణాల వలన వాయిదా పడేవి.
డైపరే దిక్కు..
ప్రస్తుతం స్పేస్ ఎక్స్ హవా నడుస్తోంది. స్పేస్ ఎక్స్ ప్రవేశపెట్టిన మిషన్లన్నీ విజయవంతం అవుతున్నాయి. దీంతో వారంతా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కానీ స్పేస్ ఎక్స్ షిప్ లో ఒక ప్రాబ్లం వచ్చి పడింది. అదే డైపర్ ప్రాబ్లం. అసలు ఈ డైపర్ ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? స్పేస్ ఎక్స్ సంస్థ నిర్మించిన డ్రాగన్ వ్యోమనౌక ఆరు నెలల కిందట నలుగురు ఆస్ట్రోనాట్స్ ను తీసుకుని అంతరిక్షానికి వెళ్లింది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ తిరిగి వద్దామనకునే సమయంలో అందులో అనుకోని సమస్య వచ్చి పడింది. వ్యోమనౌకలో ఉన్న బాత్రూం గొట్టం ఊడిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక వ్యోమగాములు డైపర్లను ఉపయోగించాలని నిర్ణయించారు.
ఆడవాళ్లు కూడా..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 గంటల సమయం పాటు వ్యోమగాములు బాత్రూంను బిగపట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. దీంతో వారంతా డైపర్లు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యోమగాముల్లో మహిళలు కూడా ఉండడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కానీ వారిలో ఉన్న మెక్ అర్థర్ అనే మహిళా వ్యోమగామి అంతరిక్షయానంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్లు తెలిపారు. అంతరిక్షయానం (space tourism) అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్నదని మెక్ అర్థర్ తెలిపారు. తాము ఎలాంటి ఇబ్బందులు పడినా కానీ క్యాప్య్సూల్ కు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తామని ఆమె తెలిపింది. మెక్ అర్థర్ తో పాటు ఫ్రాన్స్ కు చెందిన థామస్ పెస్కెట్, నాసాకు చెందిన షేన్ కింబ్రో, జపాన్ కు చెందిన అకిహికో హోషిడే ఉన్నారు. వీరంతా నేడు భూమి మీదకు రానున్నారు. ఇదిలా ఉండగా.. అట్లాంటిక్ మహసముద్ర తీరంలో క్యాప్య్సూల్ కిందకు దిగనుంది. కాగా వీళ్ల స్థానంలో వేరే వ్యోమగాములను పంపాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. కానీ వ్యోమగాములు అనారోగ్యం పాలవడంతో అది వాయిదా పడింది.