గుంటూరు, ఏప్రిల్ 11: సత్తెనపల్లి నియోజకవర్గం యనమెట్ల గ్రామంలో వైసిపి నేతలు బీభత్సం సృష్టించారు.
అసెంబ్లీ స్పీకర్, టిడిపి అభ్యర్థి కోడెల శివప్రసాద్ యనమెట్లలో పోలింగ్ సరళి పరిశీలనకు వెళ్లగా వైసిపి కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన స్పల్పంగా గాయపడ్డారు, వైసిపి, టిడిిపి శ్రేణుల ఘర్షణలో కోడెల శివప్రసాద్ చొక్కా చినిగింది.
దాడి నేపథ్యంలో కోడెల పోలింగ్ బూత్లోకి వెళ్లి చొక్కా విప్పి కూర్చని నిరసన తెలియజేశాడు. కోడెల తీరుపై వైసిపి శ్రేణులు ఆందోళన చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని కోడెలను బందోబస్తు మధ్య తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదనపు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.