శ్రీకాకుళం: తుగ్లక్లకు మాత్రమే ఏపీ సీఎం జగన్ది తుగ్లక్ పాలనలా కనిపిస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో రాజధానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల విషయంలో టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. అమరావతిలో ఆస్తులను నష్టపోతామనే ఉద్దేశంతోనే ఆ ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. నవరత్నాల ద్వారా పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తమ్మినేని చెప్పారు.
previous post
next post