కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు ఏపీకి సంబంధించిన ఏ విషయంలో కూడా జోక్యం చేసుకునే ప్రసక్తే లేదన్నట్లుగా బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు
జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమయ్యాయి. నిజానికి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ కు ఆనందం కలిగించేవే. ఇంకా చెప్పాలంటే ఆయన నెత్తిన పాలు.పోసేవి లాగ ఉన్నాయి.ఒక్కసారి జీవీఎల్ వ్యాఖ్యలని పరిశీలిద్దాం.మొన్నేమో ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం అస్సలే ఉండదంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు. నిన్నేమో ఏపీ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల వ్యవహారంలోనూ కేంద్రం జోక్యం ఉండదని జీవీఎల్ చెప్పేశారు. తాజాగా ఏపీలో రచ్చరచ్చగా మారిన జడ్జీల ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేంద్రం జోక్యం ఉండబోదని జీవీఎల్ కు౦డ బద్దలు కొట్టారు.
ఆయన వ్యాఖ్యల సారాంశం ఏపీకి సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదనేగా! ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఏ విషయంలో అయినా తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటూ సాగితే వాటితో కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేదని అసలు జగన్ సర్కారు నిర్ణయాల్లో కేంద్రం ఎంతమాత్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ చెప్పినట్టే కదా అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.కానీ జీవీఎల్ మేధావులు వ్యాఖ్యలతో మేధావులు, రాజ్యాంగ నిపుణులు ,న్యాయ పండితులు ఏకీభవించడం లేదు.రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం ఏమాత్రం జోక్యం చేసుకోవచ్చు అన్న దానిపై క్లారిటీ ఉంది! ముఖ్యంగా అంతర్గత భద్రత తదితర విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకుని తీరాలి! ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా మూడు రాజధానులు ,జడ్జీల ఫోన్ టాపింగ్ ఫోన్ అంశాలు ఉన్నాయి.
మూడు రాజధానుల అంశమే తీసుకుంటే విశాఖలో పెట్టానుకుంటున్న కార్వనిర్వాహక రాజధాని అమరావతిలో కొనసాగించనున్న శాసన రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం లేకున్నా కర్నూల్లో ఏర్పాటు చేయనున్న న్యాయ రాజధాని విషయంలో కేంద్రం అనుమతి తప్పనిసరి.అమరావతి నుంచి హైకోర్టు కర్నూలుకు తరలాలంటే కేంద్రం అనుమతి అనివార్యం. తాజాగా జడ్జీల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా తీవ్రమైన అంశమే.
కేంద్రం పరిధిలోకి వస్తుంది కేంద్రం జోక్యం అవసరమే. మరి మూడు రాజధానుల విషయం లోనూ ,జడ్జీల ఫోన్ టాపింగ్ అంశంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ నరసింహారావు ఎలా చెప్తున్నాడు అని వారు ప్రశ్నిస్తున్నారు.రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అని కూడా వారు అంటున్నారు. మరి జీవీఎల్ లెక్కలు ఏమిటో ఆయనకే తెలియాలి!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?