అమరావతి: ఊహించనంత భారీ స్థాయిలో పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని ఆయన టైమ్స్ నౌ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారీ విజయం దిశగా దూసుకువెళుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ నెల 30 వ తేదీన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.