ఢిల్లీ, ఫిబ్రవరి 16: బీహార్ వసతి గృహాల్లో బాలికలపై అత్యాచారాలకు సంబంధించిన కేసు విచారణ వేగవంతం అవుతోంది. ఈ కేసు విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్కుమార్ను కూడా విచారించాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్యువల్ అఫెన్సెస్ ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
నితీష్తో పాటు ముజఫర్పూర్ కలెక్టర్ ధర్మేంద్ర సింగ్, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అతుల్ ప్రసాద్లను కూడా విచారించాలని ఆదేశించింది. వసతి గృహాల వివరాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.