తెలుగునాట అల్లుడికి తన అత్తవారి ఇంట్లో ఎలాంటి మర్యాదలు లభిస్తాయో అందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడి పండుగలు, శుభకార్యాలు, సాంప్రదాయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లకి అత్తింటివారు ఆహ్వానిస్తూ వుంటారు. పైగా కొత్త అల్లుడు పండుగకు అత్తారింటికి వస్తే ఆ మర్యాదలే వేరుగా ఉంటాయి. విందులో స్పెషల్ ఐటెమ్స్ ఉండాల్సిందే.. ముఖ్యంగా APలో కొత్త అల్లుళ్లకు అత్తింటివాళ్ల విందు మెనూ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగాల్సిందే.
తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ కుటుంబం కాబోయే అల్లుడికి అదిరిపోయే విందు ఏర్పాటు చేశారు. దసరా పండుగకు కాబోయే అల్లుడ్ని ఆహ్వానించి ఏకంగా 125 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసారు. S.కోటకు చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ జంటకు వచ్చే ఏడాది మార్చి 9న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు.
నిహారిక, చైతన్యకు నిశ్చితార్థం అయ్యాక తొలి పండగ కావడంతో.. దసరాకు అత్తవారు అల్లుడ్ని ఆహ్వానించారు. పండుగ కావడంతో రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. 95 వంటకాలు బయట నుంచి కొనుగోలు చేశారు.. మిగిలినవి ఇంట్లోనే తయారు చేశారు. బాబోయ్ అన్ని వంటకాలు చూసిన ఆ అల్లుడు ఆశ్చర్యపోయాడు. అంతేకాదండోయ్ వాటిలో కొన్నింటి పేర్లూ అతనికి తెలియవట. మొత్తానికి కాబోయే అల్లుడికి పండగ ట్రీట్ను ఓ రేంజ్లో ఇచ్చి అత్తింటివాళ్లు సర్ప్రైజ్ చేశారు. కాగా ఈ విషయం తెలుగునాట వైరల్ అవుతోంది.