చెన్నై: ఆఫర్లు ఇచ్చి కస్టమర్లను పెంచుకుందామనుకున్న ఓ హోటల్ యాజమాని కటకటాల పాలయ్యాడు. అదేంటి ఆఫర్లు ఇస్తే జైలుకు వెళ్లడమేంటని మీరు అనుకోవచ్చు. నిజమేనండి అతను చేసిన ఆ ఒక్క పొరపాటే అతనిని జైలు పాలయ్యేలా చేసింది. మరి అదేంటో చదివేయండి.
తమిళనాడులోని అరుప్పుకొట్టైలో జహీర్ అనే వ్యక్తి ఆదివారం తన హోటల్ ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించి వారి సంఖ్యను పెంచుకోవాలనే ఉద్ధేష్యంతో తొలి రోజు రూ.10 కే బిర్యానిని విక్రయిస్తున్నట్టు ప్రకటించాడు. అది కాక ఈ ఆఫర్ కేవలం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నని ప్రకటించేశాడు.
దానితో బిర్యాని ప్రియులు ఊరుకుంటారా మరి..ఇంకేముంది జనాలు హోటల్ ముందు బారులు తీరారు. దానితో తోపులాట మొదలైంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా నిబంధనలను గాలికి ఒదిలేసి మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ అస్సలే పాటించకుండా నిలబడటం జరిగింది. ఇంకేముందు మన రక్షణ శాఖ భరిలోకి దిగేసింది.
పోలీసులు హోటల్ దగ్గరకు చేరుకునే సరికే యాజమాని చేయించిన 2500 బిర్యాని పొట్లాల్లో సగం వరకూ విక్రయించారు. దానితో పోలీసులు హోటల్ యాజమానిని అరెస్టు చేశారు. మిగిలిన బిర్యాని పొట్లాలను కూడా పంపిణీ చేశారు. 188, 9, 278 సెక్షన్ల కింద హోటల్ యాజమానిపై కేసు నమోదు చేశారు. ఇలాంటివి మరెప్పుడూ పునరా వృతం కాకుడదని హోటల్ యాజమానిని బెయిల్ పై విడుదల చేశారు. హోటల్ యాజమానులు ఇలాంటివి చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి. కరోనా కష్ట కాలంలో ఇలాంటి ఆపర్ల పేరుతో వారి జీవితాన్ని ఆగం చేయకండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?