వైఎస్ జగన్ వీధి బాలల సంరక్షణ కోసం ఆపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించిన సంగతి తెల్సిందే. వీధి బాలల కోసం జగన్ చేసిన ఆలోచనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతాడంటూ కీర్తిస్తున్నారు.
ఆపరేషన్ ముస్కాన్ అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈ తరహా సంక్షేమ స్కీంను మొదలుపెట్టిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. వీధి బలాలకు కరోనా టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించి.. పూర్తిగా కోలుకున్న వారికి ప్రభుత్వ వసతి గృహాలకు తరలించి ప్రభుత్వమే 20 సంవత్సరాలు వచ్చే వరకూ తోడు నిలుస్తుంది. ఒకవేళ నెగటివ్ వస్తే నేరుగా వసతి గుర్హలకు తరలించడానికి ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసారు.