అనంతపురం: మైసూర్ నుండి బళ్లారి జిందాల్ ఫ్యాక్టరీ కి వెళుతున్న జెట్ విమానానికి సాంకేతిక లోపం తలెత్తడంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర పరిస్థితుల్లో నేలపైకి దిగింది. ఈఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని సురక్షితంగా పొలాల్లో దించినట్లు పైలట్ తెలిపారు. ఈ సమయంలో విమానంలో పైలట్తో పాటు మరో వ్యక్తి ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా పొలంలో విమానం దిగడంతో పరిసర ప్రాంతంలోని వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
previous post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?