ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా ఉధృతి పెరిగిపోతోంది. నిన్న 10,000 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. ఈరోజు అంతకంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 10,167 కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, విశాఖ జిల్లాల్లో కేసులు 1,000 దాటి నమోదవుతున్నాయి. ఇక కోవిద్ మరణాలు 67 నమోదయ్యాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాకేం వస్తుందిలే అన్న నిర్లక్ష్యం కాకుండా బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉంటే పరిస్థితి ఇంతకంటే దిగజారి పోయే ప్రమాదం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. మనకు ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో అవసరం లేకపోయినా ఇంటి బయటకు వస్తే మనతో పాటు ఇంటిల్లపాదిని ఇబ్బంది పెట్టినవారం అవుతాము.