గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ అథెలిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ జాతీయ జూనియర్ అథెలిటిక్స్ ఛాంపియన్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ క్రీడాకారులకు కనీస వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల క్రీడాకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళా క్రీడాకారిణిలకు టాయిలెట్లు కూడా సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై పలువురు క్రీడాకారులు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోది, కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజులకు ఫిర్యాదు చేశారు. వేదిక వద్ద క్రీడాకారుల క్రీడాకారుల ఇబ్బందుల ఫోటోలనూ ట్యాగ్ చేశారు.
previous post