Spotify Technology : భారతదేశం లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు బాగా డిమాండ్ పెరిగింది.. పని చేసుకుంటూ గానీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ గాని నిరంతరం పాటలు వినడం చాలామందికి అలవాటు..ఇప్పటివరకు మాటలను బట్టి మూడ్ ఆధారంగా పాటల ఎంపిక లేదు.. తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటి ఫై టెక్నాలజీకి పేటెంట్ రైట్స్ పొందింది.. ఈ కొత్త టెక్నాలజీ మీ ఎమోషన్ బట్టి వాయిస్ టోన్ ఆధారంగా అదే పాటలను రికమెండ్ చేస్తుంది..
మీరు ఏం మాట్లాడుతున్నారు.. మీ వాయిస్ టోన్ వింటే చాలు.. మీ మాటలను బట్టి మీ మూడ్ పసిగట్టేస్తుంది.. మీ మూడ్ కు అనుగుణంగా పాటలను వినిపిస్తుంది.. యూజర్ల మూడ్ ను గుర్తించి వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు వీలుగా స్పాటి ఫై కంపెనీ కి కొత్త టెక్నాలజీని తీసుకు వచ్చింది. ఈ టెక్నాలజీ కోసం పేటెంట్ ను కూడా సొంతం చేసుకుంది. స్పాటి ఫై స్ట్రీమింగ్ కంపెనీ 2018 లో ఈ టెక్నాలజీ పేటెంట్ కోసం ఫిబ్రవరిలో ఫైల్ చేసింది. 2021లో ఈ టెక్నాలజీకి మంజూరు అయిందని మ్యూజిక్ కంపెనీ తెలిపింది.
అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా.. ఒక మనిషి మాట్లాడే భావోద్వేగ స్థితిని గుర్తించి , మాటల శబ్దం ఆధారంగా ఆమె ఒత్తిడిలో ఉందా.. ఆందోళనలో ఉందా.. అని పసిగట్టే స్తోంది. మాట్లాడే విధానంలో తేడాలు , ఇష్టాలను గుర్తించే విధంగా ఈ టెక్నాలజీ ను రూపొందించారు. గతంలో లో who సర్ విన్న పాటల హిస్టరీ ఆధారంగా మిగిలిన డేటాతో అవసరమైన నా మ్యూజిక్ ను సిఫార్సు చేసి అదే ప్లే చేస్తుంది. అయితే ఈ కొత్త టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?