Sri Lanka Crisis: శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా చేసినా పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మహీంద్ర రాజపక్స అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధాని అధికారిక నివాసంపై నిరసనకారులు దాడి చేయడంతో ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నిరసనకారుల కాల్చివేత ఉత్తర్వులతో భద్రతా బలగాలు, ఆయుధ వాహనాలు దేశమంతా గస్తీ కాస్తున్నాయి. రాజపక్స మద్దతుదారులు, నిరసనకారుల మధ్య చెలరేగిన హింసతో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది మృతి చెందారు. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని తెరదించి, కొత్త ప్రధానిని ఎన్నుకునేందుక అధికార పార్టీ ఎంపీలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన ఎస్జేబీతో గొటబాయి రాజపక్స చర్చలు కొనసాగిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Sri Lanka Crisis: రాజపక్స కుటుంబీకులు లేకుండా యువతతో కొత్త కేబినెట్
గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. తాజా ఘర్షణలో 250 మందికిపైగా గాయపడగా, అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతల నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. సైనిక బలగాలు భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తూ గస్తీ కాస్తున్నాయి. అధ్యక్ష పదవి నుండి తప్పుకునేందుకు గొటబయ రాజపక్స నిరాకరించారు. అయితే పరిస్థితులను చక్కదిద్దేందుకు మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘేతో చర్చలు జరిపిన గొటబయ కీలక హామీని ప్రకటించారు. వారంలో కొత్త ప్రధాని, యువ కేబినెట్ ను నియమిస్తామని హామీ ఇచ్చారు. రాజపక్స కుటుంబీకులు లేకుండా యువతతో మంత్రివర్గం ఏర్పాటునకు గొటబయి హామీ ఇచ్చారు.