శ్రీలంక ప్రభుత్వంపై ఆగ్రహంతో అధ్యక్ష భవనంలోకి నిన్న దూసుకువెళ్లిన నిరసన కారులు ఇంకా అక్కడే ఉన్నారు. భవనంలో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. వంట వార్పు చేసుకుంటారు. అధ్యక్షుడి జిమ్ లో నిరసనకారులు వ్యాయామం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపు అధ్యక్ష భవనంలో కోటి రూపాయలకు పైగా నోట్ల కట్టలను నిరసన కారులు గుర్తించినట్లు డైలీ మిర్రర్ అనే పత్రిక పేర్కొంది. వాటిని లెక్కించి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించింది.
అధ్యక్ష నివాసంలో పరిస్థితి ఈ విధంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎక్కడ ఉన్నారు అనేది తెలియడం లేదు. నిన్న ఆందోళనకారులు అద్యక్ష భవనాన్ని చుట్టుముట్టకముందే ఆయన అక్కడ నుండి ఎస్కేప్ అయినట్లు వార్తలు వచ్చినా ఆయనను ఆర్మీ కేంద్ర కార్యాలయానికి తరలించారని ఒక పక్క లేదు దేశం విడిచి వెళ్లిపోయారు అంటూ మరో వాదనలు వినబడుతున్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయంలో హడావుడిగా భారీ ఎత్తున లగేజీ, వీఐపీ కాన్వాయ్ చేరుకోవడానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో దేశాన్ని విడిచి వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. అధ్యక్షుడు గొటబాయ కనబడకుండా వెళ్లిన తరువాత స్పీకర్ మహింద అబేయవర్దెన మాత్రం ఆయన (గొటబాయ) బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారని వెల్లడించారు. ఆ తరువాత నుండి ఎటువంటి సమాాచారం అందలేదు.
ఒక వేళ బుధవారం గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసే శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ప్రధాని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రధాని పదవికి రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించడంతో తదుపరి అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ స్పీకర్ ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. అధ్యక్షుడు రాజీనామా చేసిన మూడు రోజుల్లో పార్లమెంట్ ను సమావేశపర్చి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. నెల రోజుల లోపు అధ్యక్షుడిని ఎన్నుకోవాలి.
శ్రీలంక ప్రధాని నివాసానికి నిప్పు పెట్టిన నిరసనకారులు.. బుధవారం రాజీనామా చేయనున్న అధ్యక్షుడు గొటబాయ
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?