ద్వీప దేశం శ్రీలంక లో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈ తెల్లవారుజామున దేశాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య, ఇద్దరు అంగరక్షకులతో ఎయిర్ ఫోర్స్ విమానంలో మాల్దీవులకు వెళ్లిపోయారు. ఈ రోజు (13వ తేదీ) రాజీనామా చేస్తానని గొటబాయ ఇంతకు ముందే ప్రకటించారు. అయితే ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలను తీవ్రతరం చేశారు.
ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడి కార్యాలయంలో నిరసనకారులు హాల్ చల్ చేస్తుండగా, మరో పక్క ఈ రోజు వేలాది మంది ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ప్రధాని నివాసం గోడ ఎక్కి ఆందోళనకారులు లోపలకు దూసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయినప్పటికీ నిరసన కారులు వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లిన నేపథ్యంలో తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…