ద్వీప దేశం శ్రీలంక లో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈ తెల్లవారుజామున దేశాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య, ఇద్దరు అంగరక్షకులతో ఎయిర్ ఫోర్స్ విమానంలో మాల్దీవులకు వెళ్లిపోయారు. ఈ రోజు (13వ తేదీ) రాజీనామా చేస్తానని గొటబాయ ఇంతకు ముందే ప్రకటించారు. అయితే ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలను తీవ్రతరం చేశారు.
ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడి కార్యాలయంలో నిరసనకారులు హాల్ చల్ చేస్తుండగా, మరో పక్క ఈ రోజు వేలాది మంది ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ప్రధాని నివాసం గోడ ఎక్కి ఆందోళనకారులు లోపలకు దూసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయినప్పటికీ నిరసన కారులు వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లిన నేపథ్యంలో తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?