అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వలస కూలీలతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 33 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో మందస మండలం బాలిగాం వద్ద చోటుచేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన 33 మందిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వలస కూలీలు కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా పశ్చిమ బంగాల్కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.