శ్రీకాంత్ అడ్డాల కి ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అన్న పేరుంది. వరుణ్ సందేశ్ తో తీసిన కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీకాంత్ అడ్డాల డెబ్యూ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – విక్టరీ వెంకటేష్ లతో తెరకెక్కించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో శ్రీకాంత్ అడ్డాల క్రేజ్ విపరీతంగా పెరిగింది.
దాంతో శ్రీకాంత్ అడ్డాల కి మెగా హీరోని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే బాధ్యతని అప్పగించారు మెగా ఫ్యామిలీ. ఆ బాధ్యత ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ లాఛింగ్ సినిమా ని బాగానే తెరకెక్కించాడన్న పేరు తెచ్చుకున్నాడు. వరుణ్ తేజ్ ని ముకుంద సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేసిన శ్రీకాంత్ అడ్డాల హిట్ ఇచ్చాడన్న ప్రశంసలు అందుకున్నాడు. అయితే శ్రీకాంత్ అడ్డాల వేసిన పెద్ద రాంగ్ స్టెప్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన బ్రహ్మోత్సవం. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.
దాంతో మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల కి టాలీవుడ్ సినిమా చేసే ఛాన్స్ రాలేదు. దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత ఎట్టకేలకి వెంకటేష్ తో మళ్ళీ నారప్ప తీసే అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. దాంతో శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ సినిమా కమిటయ్యాడని అంటున్నారు. అంతేకాదు మళ్ళీ నిత్తి మీద పెద్ద బాధ్యతనే పెట్టుకున్నాడట. ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల తనయుడు ని హీరోగా లాంఛ్ చేసే బాధ్యత తీసుకున్నాడట. జీఏ 2 బ్యానర్ లో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందబోతుండగా ‘కూచిపూడి వారి వీధిలో’ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారు.