ఎస్ ఎస్ రాజమౌళి.. క్లారిటీకి కేరాఫ్ అడ్రస్. ఎవ్వరు ఏం చెప్పినా.. ఎవ్వరు ఏం అన్నా.. తన క్లారిటీ తనకు ఉంటుంది. ఏమాత్రం కూడా భయపడడు జక్కన్న. తనకు అంత క్లారిటీ ఉండటం వల్లే ఆయన ఓటమి ఎరుగని ధీరుడయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఆయన ఒక సినిమా చేస్తున్నప్పుడు తన తదుపరి ప్రాజెక్టు గురించి ఏమాత్రం ఆలోచించడు. ఆ సినిమా అయిపోయాకనే వేరే సినిమా. కలగూరగంప అంటే రాజమౌళికి ఇష్టం ఉండదు. ఈ విషయం ఆయన చాలా సార్లు చెప్పారు.
అయినప్పటికీ.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని అందరూ అంటున్నారు. ఆయన కూడా ఒకటి రెండు చోట్ల చెప్పారు కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. అది పాన్ ఇండియా లేవల్ మూవీ అని తెలిసింది. అయితే.. ఈ సినిమాపై మళ్లీ నోరుమెదపలేదు జక్కన్న. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాపైనే తన దృష్టినంతా కేంద్రీకరించారు.
అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబుతో సినిమాకు సంబంధించిన ప్రశ్న అడగగా.. జక్కన్న ఏం సమాధానం చెప్పారంటే? నేను ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ముందు నుంచీ నేనింతే.. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయితే కానీ.. మహేశ్ తో ఎటువంటి సినిమా చేయాలి.. అనే దానిపై ఆలోచిస్తాను.. తప్పితే ఇప్పుడే నేను ఏం చెప్పలేను.. అని రాజమౌళి చాలా క్లారిటీతో సమాధానం చెప్పారు. దీంతో మహేశ్, రాజమౌళి సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్టయింది.
అయితే.. మహేశ్ తో రాజమౌళి.. జేమ్స్ బాండ్ తరహాలో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మహేశ్ సినిమాకు బలమైన కథ రాస్తున్నారట. అయితే.. మహేశ్ తో కలిసి తీయబోయే సినిమా గురించి చాలా సీక్రెట్ మెయిన్ టెన్ చేస్తున్నాడు రాజమౌళి. అందుకే.. ఆ సినిమా గురించి ఏం అడిగినా దాటవేస్తున్నాడు. చూద్దాం.. ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక అయినా మహేశ్, రాజమౌళి కాంబో సినిమా గురించి ఏవైనా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయో?