SSC job notification : భారత ప్రభుత్వ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( staff selection commission ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ Multi tasking staff examination :
అర్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయసు : 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు , ఎస్సీ , ఎస్టీలకు 5 సంవత్సరాలు , పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ట వయసు లో మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష టైర్ -1, టైర్ -2 డిస్క్రిప్టివ్ పేపర్, లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం : రూ. 16000 -22000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్స్లు అదనం.
దరఖాస్తు ఫీజు :
ఇతరులకు రూ.100/- ఎస్సీ, ఎస్టీ , పిడబ్ల్యుడి, మాజీ సైనిక ఉద్యోగులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 21/3/2021
టైర్ -1 పరీక్షా తేదీ : 1/7/2021
టైర్ -2 పరీక్షా తేదీ : 21/12/2021
వెబ్ సైట్ : ssc.nic.in