Acharya : ఆచార్య చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 152వది కాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తూనే నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా ఈ సినిమా మే 13న రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ ట్రాక్ యాడ్ చేయబోతున్నట్టు తాజా సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రతీదీ పీక్స్ లో ఉండాల్సిందే. మెగా అభిమానులు .. కామన్ ఆడియన్స్ మెగాస్టార్ డాన్స్ కోసం పడి చచ్చిపోతారు. ఆయన చేసే ఫైట్స్.. కామెడీ సీన్స్ ఇలా అన్నీ ఎమోషన్స్ ని థియేటర్స్ లో ఎంతగా ఎంజాయ్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా కుదరకపోయినా అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతారు. విపరీతంగా ఫీలవుతారు. మెగాస్టార్ సినిమాలో కామెడీ ట్రాక్ చాలా ఇంపార్టెంట్. అన్నయ్య టైమింగ్ కి తగ్గ కామెడీ ట్రాక్ ఉండాలే గానీ థియేటర్స్ లో అరుపులే.
Acharya : ఆచార్య సినిమాలో మెగాస్టార్ – వెన్నెల కిషోర్ ల కామెడీ ట్రాక్ ..!
అయితే ఆచార్య సినిమాలో అలాంటి కామెడీ ట్రాక్ లేదట. అందుకే స్వయంగా మెగాస్టార్ కొరటాలతో చెప్పి ప్రముఖ రచయిత శ్రీధర్ సీపానతో మంచి కామెడీ ట్రాక్ ని యాడ్ చేయించారట. ఈ సీన్స్ లో మెగాస్టార్ – వెన్నెల కిషోర్ కనిపించబోతున్నారు. ఇంతక ముందు సినిమాలలో ఎక్కువగా బ్రహ్మానందం తో చిరంజీవి కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా నవ్వించాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఆచార్య సినిమాలో మెగాస్టార్ – వెన్నెల కిషోర్ ల కామెడీ ట్రాక్ ఉండబోతోందట. ఇక త్వరలో మెగాస్టార్ మలయాళ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారు.