Pooja hegde: సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్స్గా వెలుగుతున్న దాదాపు అందరి కల ఒకటే. ఎక్కడ ఎక్కువగా సినిమాలు చేస్తే అక్క ఓ సొంతిల్లు కొనుక్కోవాలనే కలలు కనడం. దాదాపు అందరూ హీరోయిన్స్ ఇప్పుడు ఈ కలలను నెరవేర్చుకునే పనుల్లో ఉన్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేశ్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, సాయి పల్లవి ఇలా చాలా మంది ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్కి దగ్గరగా ఉండేందుకు అక్కడే ఓ లగ్జరీ ఫ్లాట్ లేదా విలాసవంతమైన విల్లాస్ వంటివి కొనుగోలు చేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే హీరోయిన్స్కి ఇది పెద్ద డ్రీం అని చెప్పాలి. అది కూడా వారికి నచ్చిన ఇంటీరియర్ డిజైన్తో విలాసవంతమైన ఇల్లు కొనుక్కోవడం అంటే జీవితంలో ఓ కల నెరవేరినట్టే. అంతక ముందు సమంతకి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండేది కాదనే విషయం తెలిసిందే. నాగ చైతన్యను పెళ్ళి చేసుకున్న సమంత ఇటీవల ఆయన నుంచి విడాకులు తీసుకుంది. అయితే ఇన్నేళ్ళు కలిసి ఉన్న ఓ లగ్జరీ ఫ్లాట్ను నాగ చైతన్య సమంతకు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఈ లగ్జరీ ఫ్లాట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే. ఇదే అపార్ట్మెంట్స్లో పలువురు సినీ తారలు ఉంటారట.
Pooja hegde: పూజా హెగ్డే ముంబైలో సొంతిల్లు కొన్నారు.
ఇక ఇటీవలే ఆమె ముంబైలోనూ ఓ ఇల్లు కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. ఇకపై ముంబైలో ఎక్కువగా సమయం గడపాలని..హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టాలనే ప్లానింగ్ తోనే సమంత ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిందని..త్వరలో హైదరాబాద్కు టాటా చెప్పేస్తుందని చెప్పుకున్నారు. కానీ ఆమె స్వయంగా నేను ఎక్కడికీ వెల్లడం లేదు. హైదరాబాదే నా ఇల్లు..ఇక్కడే ఉంటానని వెల్లడించింది. ఇక మన స్టార్ హీరోయిన్స్లో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో ఏ రేంజ్ స్టార్ డమ్ తెచ్చుకుందో తెలిసిందే. ఇక్కడ మంచి సినిమాలు చేస్తోంది. కాబట్టే ఆమె హైదరాబాద్లో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనిందట. ఇది కూడా ఎప్పుడో.
రష్మిక మందన్న కూడా ఇటీవల హైదరాబాద్లో సొంత ఫ్లాట్ కొనిందని గత ఏడాది వార్తలు వచ్చాయి. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి హోటల్స్లో ఉండి ఇబ్బంది పడటం ఇష్టం లేక సొంతగా ఇల్లు కొనిందని అన్నారు. శృతి హాసన్ కూడా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. అందుకే ఆమె కూడా ఇక్కడ సొంతిల్లు కొనే ప్రయత్నాలలో ఉందట. ఇక ప్రస్తుతం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా బిజీగా ఉన్న పూజా హెగ్డే ముంబైలో సొంతిల్లు కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటి పనులను పూజాతో పాటు వాళ్ళ అమ్మ దగ్గరుండి చూసుకుంటున్నారు.
Pooja hegde: సొంతిల్లు కొనుక్కుంటే అక్కడ హోటల్స్లో ఉండాల్సిన పనిలేదని డిసైడయిందట.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పూజా హెగ్డే స్వయంగా తెలిపింది. ప్రస్తుతం ఆమె ఇంటికోసం చేస్తున్న పనులకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి ఇప్పుడు బాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక కూడా ముంబైలో ఓ సొంత ఇల్లు కొనుక్కునే ఆలోచన చేస్తోందట. ప్రస్తుతం రష్మిక తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఈ మధ్య ట్రావెలింగ్ విపరీతంగా చేస్తోంది. ఈ విషయంలో రష్మిక అమ్మా నాన్నలు కూడా ఫీలవుతున్నారు. అందుకే ముంబైలో ఓ సొంతిల్లు కొనుక్కుంటే అక్కడ హోటల్స్లో ఉండాల్సిన పనిలేదని డిసైడయిందట. వీరే కాదు క్రేజ్ ఉన్న పలువురు స్టార్ హీరోయిన్స్ ముంబైలో ఇల్లు కొనుక్కుంటున్నారు.