ఈ జాబ్ లతో విసిగిపోయారా.. లేక కరోనా వల్ల జాబ్ పోయి బాధపడుతున్నారా.. ఒక మంచి బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే.. తక్కువ పెట్టుబడి, మంచి రాబడులు, సమస్యలు లేని వ్యాపారం చేయాలనుకుంటే మేము చెప్పే ఈ బిజినెస్ ను ఫాలో అయిపోండి. దాంతో నెలకు లక్ష రూపాయల మెత్తాన్ని సంపాదించడమే కాకుండా నలుగురికి పని ఇచ్చిన వారుకూడా అవుతారు. మరెందుకు ఆలస్యం చదివేయండి.
ఇంట్లో, ఆఫీసుల్లో ఎక్కువగా వినియోగించే టిష్యూ పేపర్ బిజినెస్ చేస్తే.. మంచి లాభాలు రావడం పక్కా. రెస్టారెంట్లు, హోటల్ లో వీటి వినియోగం గురించి చెప్పనవసరం లేదు. అలాగే కరోనా వచ్చినాక వీటి వినియోగం మరి ఎక్కువైందనే చెప్పుకోవాలి. అటువంటి బిజినెస్ చేస్తే.. లాస్ అవుతామనే ఇబ్బంది ఉండదు. మరెందుకు ఆలస్యం ఈ టిష్యూ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? బ్యాంకుల నుంచి లోన్ లో డబ్బులను ఏమైనా తీసుకోవచ్చా అనే విషయాలను తెలుసుకోండి.
ఈ టిష్యూ పేపర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు రూ. 11 లక్షలను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మీ వద్ద సరిపోయేంత డబ్బు ఉంటే సరి లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవచ్చు కాబట్టి. బ్యాంక్ నుంచి తీసుకునే లోన్ లో టర్మ్ లోన్ తో పాటు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేసేయోచ్చు. బ్యాంకర్లు బిజినెస్ కోసం లోన్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
అయితే ఈ బిజినెస్ కోసం మెషన్ల కొనుగోలుకు దాదాపుగా రూ. 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ట్రాన్స్ పోర్ట్, కన్సూమబుల్స్, టెలిపోన్స్, స్టేషనరీ, మెయింటెన్స్, ఎలక్ట్రిసిటీ లాంటి వాటికోసం రూ. 7 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.అలాగే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందే ట్రేడ్ లైసెన్స్, పొల్యూషన్ సెంట్రల్ బోర్డు నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ తీసుకోవడం వంటి పనులను పూర్తి చేయాలి.
దీంతో ఏడాదికి 1.5 లక్షల కేజీల పేపర్ న్యాప్కిన్ లను తయారు చేయోచ్చు. దీనికి మార్కెట్ ధర కేజీకి రూ. 65 ఉంటుంది. దీంతో ఏడాదికి రూ.97లక్షల వరకు టర్నోవర్ ఉంటుంది అనమాట. ఖర్చులన్నింటిని తీసివేస్తే.. సంవత్సరానికి రూ.12లక్షల వరకు మనకు మిగులుతుంది. అంటే నెలకు లక్ష రూపాయలను సంపాదించినట్లే కదా.. ఇంకో విషయం దీనికి లోన్ తీసుకోవాలనుకునే వారు.. ముద్రా స్కీమ్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు.