స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఏడాది నుండి రెండేళ్ల లోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేటును 0.20 శాతాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
గతంలో ఈ వ్యవధిలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేటు 5.10 శాతం ఉండగా తాజా నిర్ణయంతో అది 4.90 శాతానికి తగ్గిపోయింది. సీనియర్ సిటిజన్ల విషయంలోనూ ఈ వడ్డీ రేటు తగ్గింపు వర్తిస్తుందని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. వారి విషయంలో 5.60 శాతం ఉన్న వడ్డీ రేట్లు, 5.40 శాతానికి తగ్గినట్లయింది. ఈ నెల 10 నుండి ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. ఈ వడ్డీ తగ్గింపులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాక్ ఇచ్చినట్లే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?