కేంద్రం నుండి రాష్ట్రాలకు రావలసిన జీఎస్టీ వాటాను విడుదల చేసారు. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ. 36,400 ని ఆయన ఖాతాల్లో వేసారు. దీనిలో భాగంగా ఏపీ వాటాగా రూ. 681.2 కోట్లు నగదు ఖాతాకి చేరింది. గత ఏడాది డిసెంబర్ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మూడు నెలల వాటా ఇది.
సాధారణంగా జీఎస్టీ వాటాలుగా రాష్ట్రాలకు సగం, కేంద్రానికి సగం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఇలా చెల్లింపులు ఉంటాయి. మన రాష్ట్రానికి సగటున రూ. 800 కోట్లు వరకు వస్తుంటాయి. కానీ ఈ మూడు నెలల కాలంలో కొనుగోళ్లు తగ్గిన కారణంగా నగదు కూడా స్వల్పంగానే చేరింది. ఇక మార్చి నుండి మే 2020 మధ్య కాలానికి జీఎస్టీ పెద్దగా వచ్చే అవకాశం లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుండి మే రెండో వారం వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉంది. సో.. ఈ వ్యవధిలో కనీసం రూ. 100 కోట్లయినా రాష్ట్ర వాటాగా వస్తుందో లేదో అనుమానమే.