పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హవాను దెబ్బతీసి అధికారంలోకి రావాలని బీజెపీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజెపీ కేంద్ర నాయకత్వం ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న టీఎంసీ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజెపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.అయితే బీజెపీ హిందూత్వ ఆటలు పశ్చిమ బెంగాల్లో సాగవని మమత ఘాటుగా సమాధానాలు చెబుతోంది. రాష్ట్రంలో తరచు టీఎంసీ, బీజెపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పర్యటనలో బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా కాన్వాయ్పై గురువారం కొందరు రాళ్ల దాడి చేశారు. కోల్కతాలోని డైమండ్ హార్బర్ కు వెళుతుండగా టీఎంసీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వారు రహదారిని నిర్బంధించి నడ్డా కాన్వాయ్ ని అడ్డుకున్నారు. నడ్డా కాన్వాయ్ పై టీఎంసీ మద్దతు దారులే రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. ఈ ఘటనలో బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ కారు ధ్వంసం అయినట్లు తెలిపారు.
ఈ ఘటనపై దిలీప్ ఘోష్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జెపి నడ్డా పశ్చిమ బెంగాల్ పర్యటనలో భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపారు. బుధవారం నడ్డా పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా లేరని పేర్కొన్నారు. నేడు పోలీసులు ఉన్నా ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాను దివీప్ ఘోష్ కోరారు కాగా దాడికి సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్ బీజెపీ శాఖ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.
TMC goons attacked Kailash ji at Sirakal more, Diamond Harbour. Aimed bricks at him. Why Pishi and Bhaipo are so scared? Shameful act of cowardice! Clearly Pishi & her goons are fearful of people’s support for BJP in West Bengal. #BengalSupportsBJP pic.twitter.com/v9hblXevu9
— BJP Bengal (@BJP4Bengal) December 10, 2020