Death anniversary: ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ఆచారాలు, పద్దతులు, సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక మనిషి మరణించినప్పుడు చేసే ఆచారాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో లా ఉంటాయి. మన భారతదేశంలో అయితే ఒక మనిషి మరణించిన తర్వాత కర్మకాండలు నిర్వహిస్తాం ఆ తరువాత సంవత్సరానికి Death anniversary ఒకసారి సంవత్సరీకం పేరుతో మరణించిన వారిని గుర్తు చేసుకుంటాం.
కొన్ని ప్రాంతాలలోని ఆచారాలు భీతిగొలిపే విధంగా ఉంటాయి. ఈ కోవలోకే ఇండోనేషియా లోని ఒక గ్రామంలోని ఆచారాలు మనకి భయం కలిగించే విధంగా ఉంటాయి. ఇండోనేషియాలోని రిందిగాల్లో అనే గ్రామంలో ప్రజల నమ్మకాలు మరియు వారి విశ్వాసాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉన్నాయి.
ఆ గ్రామ ప్రజలు చేసే సంవత్సరిక ఆచారం ఎలా ఉంటుందంటే… మరణించిన వారి కుటుంబీకుల పార్ధివ దేహాన్ని సంవత్సరానికి ఒకసారి సమాధి నుంచి బయటకు తీస్తారట.
ఆలా బయటకు తీసిన పార్థివ దేహాలను కొన్ని రసాయనాలతో శుభ్రపరిచి వారు బ్రతికి ఉన్నప్పుడు ఎలా అయితే జీవించారో అదే విధంగా మళ్ళి ఆ పార్థివ దేహాలను రెడీ చేస్తారట. వారికి ఏ ఏ రంగుల దుస్తులు ఇష్టమో వాటిని ధరింపచేసి వారికి ఇష్టమయిన ఆహార పదార్ధాలను కూడా ఏర్పాటు చేస్తారట.. ఆ తరువాత ఆ పార్థివ దేహాలను వారి ఇంటికి తీసుకువచ్చి వారు బ్రతికి ఉన్నప్పుడు ఏ ప్రదేశంలో ఇష్టంగా కుర్చునేవారో మళ్ళి ఆ స్థలంలోనే కూర్చోబెడతారు.
ఆ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా భోజనం చేస్తారు. ఇక సాయంత్రం అయ్యే సమయానికి కుటుంబీకుల మొహాలలో మళ్ళి విషాద ఛాయలు అలుముకుంటాయి. ఆ రోజు రాత్రి చీకటి పడిన తర్వాత మళ్ళి గ్రామస్తులంతా కలిసి శవాలను తిరిగి యధావిధిగా సమాధి లో పెట్టి సమాధులను మూసివేస్తారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.