Janagama: జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడ ఒకే కాలనీకి చెందిన కొందరు యువకులు ఒకరి తర్వాత మరొకరుగా కారణం లేకుండా అనుమానాస్పద రీతిలో ప్రాణాలువిడుస్తున్నారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలలో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది చూసి ఆ కాలనీ లోని మిగిలిన జనం వారికి చేతపడి జరిగిందని అందుకే వారందరు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని నమ్మడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆ కాలనీ లోని ఓ పాడుబడ్డ భవనంలో రాత్రి ఓ దెయ్యం నగ్నంగా తిరుగుతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనితో ప్రాణభయంతో అక్కడ ఉన్న 40 కుటుంబాలు ఆ కాలనీ ని విడిచి వెళ్లిపోతున్నారు.
కొన్ని రోజుల క్రిందట ఈ కాలనీలో అర్ధరాత్రిళ్లు ఓ దెయ్యం తిరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆ కాలనీ రోడ్ల మీద రాత్రిళ్లు ఓ మహిళ నగ్నంగా తల పై బోణం ఎత్తుకుని నృత్యం చేస్తూ కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ఆ కాలనీ లో చనిపోయిన ఈ ముగ్గురి మరణాలకు చేతబడే కారణమనీ స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. వీరి ముగ్గురి మరణాలకు ఆ దెయ్యం కారణమని అక్కడ ఉంటె వీరి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆ కాలనీ ని ఖాళీ చేసి మొత్తం 40 కుటుంబాలు వెళ్లిపోయాయి.
ఆ కాలనీలో ఉంటున్న మొత్తం 40 కుటుంబాలు బుధవారం నాడు ఖాళీ చేసి వెళ్లిపోవడం గమనార్హం. కాగా, ఈ విషయమై వీరికి అవగాహన కల్పించడానికి ధైర్యం చెప్పడానికి అక్కడి పోలీసులు చాలా ప్రయతినిస్తున్నారు కానీ వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి అని ఆ గ్రామ సర్పంచ్ ఎండబట్ల అంజమ్మ చెబుతున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.