తూర్పుగోదావరి జిల్లా రాజోలు రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ వైసీపీపై గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాకెట్ స్పీడ్లో దూసుకెళుతుండగా అధికార పార్టీ నాయకులు అవాక్కై చూస్తుండడం వింతల్లో వింత!
రాపాక ఇప్పటి వరకు అధికారికంగా వైసిపిలో చేరలేదు .కానీ తనకు రాజోలు వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు కావాలని బహిరంగంగా డిమాండ్ చేయడం రాజకీయ పరిశీలకులనే విస్మయ పరిచింది!అధికార పార్టీ తరఫున ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు పోటీ చేసి రాపాకపై ఓడిపోయారు. తర్వాత రాపాక.. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో ఈ ఇద్దరి మధ్య రాజకీయాలు పరిమితమవుతాయని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మాల కార్పొరేషన్ చైర్మన్ పెడపాటి అమ్మాజీ రంగ ప్రవేశం చేశారు. ఆమె నియోజకవర్గానికి నాన్ లోకల్.
అయినప్పటికీ.. నియోజకవర్గంలో మాత్రం చక్రం తిప్పుతున్నారు. బొంతు రాజేశ్వరరావు 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఓడినా ఆయనకు బలమైన వర్గం ఉంది.అయితే ఇక్కడ రాజకీయాలను శాసించే ఓ ముగ్గురు రాజులు ఆయన తమ మాట వినడం లేదని పట్టుబట్టి జగన్పై ఒత్తిడి తెచ్చి మరీ అమ్మాజీని ఇన్చార్జ్గా నియమించుకున్నారు.ఈ దశలో రాపాక వరప్రసాద్ వైసీపీ వైపు మళ్లారు.అసలు జగన్ తనకు రాజోలు సీట్ ఇద్దాం అనుకున్నారని,కుదరకపోవడంతో తాను వ॥జనసేన లోకివెళ్లి గెలిచానని,అయితే ఎమ్మెల్యేగా గెలిచిన రెండో రోజే తాను కలవగా ముఖ్యమంత్రి జగన్ కలిసి పని చేద్దామని తనకు చెప్పారని
అందుకనే తాను ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాపాక బహిరంగంగా ఒక వీడియోలో ప్రకటించారు.ఇక నియోజకవర్గంలో ఫండ్స్తో పాటు ఇతర అభివృద్ధి పనుల నిధులు కూడా తనకే కేటాయిస్తున్నారని ఆయన ఓపెన్గానే చెప్పారు. తద్వారా తానే రాజోలులో వైసీపీకి రాజు లాంటి వాడినని రాపాక ప్రకటించుకున్నారు అయితే జనసేన నుండి వచ్చి తమ మీద రాపాక పెత్తనం ఏమిటని వైసీపీ పాత కాపులు పరమేశ్వరరావు ,అమ్మాజీలు వాపోతున్నారు.రాజోలు వైసీపీలో ఈ మూడు ముక్కలాటలో ఎవరు విన్నరో తేలాల౦టే మరి కొ౦త కాలం ఆగాలి.