ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. పాలనా విషయంలో భేషుగ్గా రాణిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు విరుచుకుపడదామా అని రెడీగా ఉన్న ప్రతిపక్షాలకు తాగుబోతుల రూపంలో ఒక మంచి సాకు దొరికింది. మద్యం దొరక్క తాగుడికి బానిస అయిన వారి మానసిక స్థితి సరిగ్గా లేని వారు అందుబాటులో ఉన్న శానిటైజర్ పానకం తాగినట్లు తాగుతున్నారు.
దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లాలో 12 మంది ఈ శానిటైజర్ తాగి మృత్యువాత పడగా…. తాజాగా కడప లో మరో ముగ్గురు చనిపోయారు. ఇక లాక్ డౌన్ లో మద్యం అందరికీ అందుబాటులో లేక అందరూ శానిటైజర్ పైన పడుతున్నారు. ఇక ఏపీలో దాదాపు 30 మంది ఈ వారం రోజుల్లోనే నుండి ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ విషయమై చాలా సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇలా శానిటైజర్ తాగిన వాళ్ళని వదిలి పెట్టవద్దు అని నిర్ణయించుకుంది. సీఎం జగన్ కూడా ఇందుకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో రోజురోజుకు శానిటైజర్ తాగేవారి కేసులు పెరుగుతున్నారు. ఇక తాజాగా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేట్ సెంటర్ లోని రైల్వే గేటు సమీపంలో ఒక వ్యక్తి శానిటైజర్ తాగుతున్న వీడియో వైరల్ అయింది. ఆ వృద్ధుడి కోసం ఇప్పటికే అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కడప జిల్లాలో కూడా అలాంటి కరువు బాధితులందరి పై ఒక కన్ను వేస్తున్నారు. దొరికితే తక్షణమే అధికారులు వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇప్పించాలి…. వారు అందుకు లోబడకపోతే నేరుగా మానసిక వైద్యశాలలో లేదా రీహ్యాబిటలైజేషన్ సెంటర్ లో చేర్చవలసిందిగా చెబుతున్నారు. ఇలాంటి వారి వల్ల వారి కుటుంబాలు మాత్రమే నష్టపోకుండా ఇతరులు ఇందుకోసం ఇలా శానిటైజర్ పుచ్చుకునేళా ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి వారి కోసం స్పెషల్ గా అధికారులు రంగంలోకి దిగి ఇలా మద్యం బానిసల పై నిఘా వేసి ఉన్నారు.