వైసీపీ అంటే రెడ్డి పార్టీ అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రంగంలోకి దిగింది ! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ తరహా విమర్శలు చేయడం తెలిసిందే!
జగన్ మోహన్ రెడ్డి పాలన లో రెడ్ టేపిజం లేదుగాని రెడ్డిజం తారా స్థాయిలో ఉందని ఆయన పంచ్ డైలాగ్ వేయటం గుర్తుండే ఉంటది. అసెంబ్లీలో విప్ పదవులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమైన పోస్టులు టిటిడి సభ్యత్వాలు చైర్మన్ పదవి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ తరహా విమర్శలు చేయడం తెలిసిందే! జగన్ మోహన్ రెడ్డి పాలన లో రెడ్ టేపిజం లేదుగాని రెడ్డిజం తారా స్థాయిలో ఉందని ఆయన పంచడైలాగ్ వేయటం గుర్తుండే ఉంటది.
అసెంబ్లీలో విప్ పదవులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమైన పోస్టులు టిటిడి చైర్మన్ పదవి సభ్యుల పదవులు అన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతున్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో ఏపీ రెడ్డి సంఘం అధ్యక్షుడు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ఎంపీ రఘురామ కృష్ణం రాజును తీవ్రంగా దుర్భాషలాడుతూ ఒక వీడియో విడుదల చేయటం జరిగింది. అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది! రెడ్ల పై అకారణంగా నిందలు వేస్తే చెప్పు విరిగేటట్లు కొడతామని రఘురామకృష్ణం రాజును ఆయన హెచ్చరించారు.
ఒక్క రామకృష్ణ రాజే కాదు తమ జోలికి వస్తే ఎంత పెద్ద పదవిలో ఉన్న ఏ రాజకీయ నాయకుడినయినా, చివరకు మాజీ ముఖ్యమంత్రి నయినా చెప్పుతో కొడతామని ఆయన పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి కూడా హెచ్చరిక జారీ చేశారు ఆయన పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో 60 లక్షల మంది రెడ్లు ఉంటే మహా అయితే రెండు వందలు లేదా 300 మంది రెడ్లకు ఏదో ఒక పదవిని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని ఆయన వివరించారు. అంతమాత్రానికే రెడ్లను జగన్ నెత్తిన పెట్టుకుంటున్నారని ఇతర సామాజిక వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించడం సరికాదని అన్నారు.
రెడ్లు తమ సర్వం దారపోసి జగన్ సీఎం కావడం లో కీలకపాత్ర పోషించారన్నారు. రాజకీయాల్లో భాగంగా ప్రతి కులానికి ఎంతోకొంత ముఖ్యమంత్రి చేస్తున్నారని, వారిలో రెడ్లు కూడా ఉన్నారని ,అంతమాత్రం చేత అంతా రెడ్లకే జగన్ దోచి పెడుతున్నారని ప్రచారం చేయడం సమంజసం కాదని ,అందువల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని నరేష్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా రఘురామకృష్ణంరాజు గానీ రెడ్లను ద్వేషించే ఇతర పార్టీల వారు గాని ఈ తరహా ప్రచారాన్ని మానుకోకుంటే రెడ్డి కులస్తులు అలాంటివారిని చెప్పులతో కొట్టి సన్మానిస్తారని ఆయన హెచ్చరించారు.కాగా ఈ వీడియో వెనుక వైసిపి కూడా ఉందా అన్నదే మరో చర్చనీయాంశంగా మారింది!