(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి పిలుపు మేరకు నేతలు బస్టాండ్ సెంటర్ వద్ద కళాశాల బస్సులను నిలిపివేశారు.
సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి జెఎసి నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తీవ్రతరం అవుతుందని విద్యార్థి జెఎసి నేతలు హెచ్చరించారు.