విజయవాడ, జనవరి 25: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్ల అమలులో ఎపిపిఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఉదయభాస్కర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇటీవల ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. పరీక్షను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘ నేతలతో చర్చలు జరుపుతున్నారు.