Madanapalle : సంచలనం సృష్టించిన మదనపల్లె హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ కేసులో కీలక పాత్రధారి పెద్ద కూతురు అలేఖ్యఅని వెల్లడవుతోంది.
చెల్లెలు సాయిదివ్యను చంపేసి తనను కూడా చంపేయమంటూ తల్లితండ్రులను పురికొల్పిన అలేఖ్య తాంత్రిక పూజలకు అలవాటు పడ్డట్లు తెలుస్తోంది. భోపాల్లో చేరినప్పట్నుంచి తాంత్రిక పూజలు ఎక్కువగా నమ్మేదని.. ఆ మూఢనమ్మకాలను తల్లిదండ్రులను నమ్మించినట్లు సమాచారం. హత్యలకు ప్రొత్సహించింది అలేఖ్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలేఖ్య మ్యాజిక్లు కూడా చేసేది. ఆమె గదిలో హర్రర్ పుస్తకాలు గుర్తించారు పోలీసులు. మ్యాజిక్లతో ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులను నమ్మించి ఇంత దారుణానికి ఒడిగట్టిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Madanapalle : అసలేం జరిగింది ?అంతా మిస్టరీ!
అసలు హత్యకు పది రోజులు ముందు ఆ ఇంట్లో ఏమి జరిగిందనేది ప్రశ్నార్ధకం. సీసీ కెమెరాలలో కూడా దృశ్యాలు రికార్డ్ కాలేదు. బంధువులు మాత్రమే వచ్చి వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు అంటున్నారు. ఆ పది రోజులు తాంత్రిక పూజలలో కుటుంబం నిమగ్నమైయిందా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పాలు పోసే వాళ్లను కూడా రావద్దని చెప్పినట్లు సమాచారం. బంధువులు ఇంటికి వచ్చినా వెంటనే వెళ్లిపోవాలని అలేఖ్య కుటుంబం చెప్పినట్లు తెలుస్తోంది.
హిప్నాటిజమే ఇంత అనర్ధానికి మూలమా?
మూఢనమ్మకాలతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. నూతనంగా నిర్మించిన ఇంటికి వచ్చి ఏడాది కూడా కాలేదు. మూఢ భక్తితో నిండు ప్రాణాలు బలయ్యాయి. అలేఖ్య తన కుటుంబం మొత్తాన్ని హిప్నటైజ్ చేసింది.అలేఖ్య హిప్నాటిజం ప్రభావంగానే తల్లితండ్రులు కూడా ఆమె చెప్పినట్లు చేశారన్న వాదన వినిపిస్తోంది.మానసిక వైద్యులు కూడా హిప్నాటిజానికి అంత ప్రభావం ఉందని అంగీకరిస్తున్నారు .సాయి దివ్య నాలుకను కోసేయగా.. ఆ నాలుకను పద్మజ తినేసినట్లు గగుర్పొడిచే నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. అటు.. జైల్లో ఉన్న పద్మజ పోలీసులు, ఖైదీలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అరుపులతో జైలును హోరెత్తిస్తుంది.కాగా మదనపల్లి ఘటన పోలీసులకు కూడా అంతుచిక్కనిదిగా తయారైంది.రోజుకో నిజం బయటికొస్తుండడంతో వారే నివ్వెరపోతున్నారు.ఈ తరహా ఘటన తమకు ఎప్పుడూ ఎదురుకాలేదని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లోనే అరుదైన సంఘటన అంటున్నారు.