Breaking: వైయస్ షర్మిల ప్రతి మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం.. నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో.. షర్మిల చేపట్టిన దీక్ష కి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నేతలు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే రేపు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం.. లింగాపూర్ లో దీక్ష చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి.. కుటుంబాన్ని.. పరామర్శించడానికి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఉద్యోగం లేక ఆ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏపాటిలాగాన్నే షర్మిల కూడా రెడీ అయ్యారు. ఇక అంత ఒకే అని అనుకున్న టైం లో ఆ నిరుద్యోగి కుటుంబం తండ్రి భూక్య శంకర్ నాయక్.. వైయస్ షర్మిల తన ఇంటికి రాకూడదని.. విజ్ఞప్తి చేశారు. తన కొడుకు ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే కానీ మా కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న మా కొడుకు.. చావుని రాజకీయం చేయవద్దు అంటూ వైఎస్ షర్మిల కి విజ్ఞప్తి చేస్తూ వీడియో.. పోస్ట్ చేశారు. ఈ పరిణామం తో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు..కి షర్మిలకు సడన్ షాక్ ఇచ్చినట్లు అయింది.