సర్కారు వారి పాట మూవీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం. ఈ చిత్రం షర వేగంగా షూటింగ్ ను పూర్తి చేసే పనిలోపడింది. జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. అందల తార కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకురావాలని సినిమా యూనిట్ తెగ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. మహేష్ ఖాతలో మరో హిట్ ఖాయమని అభిమానులు ఇప్పటికే అనుకుంటున్నారు. ఇప్పుడు మరో వార్తతో ఈ సినిమాకు మరింత ఆదరణ లభించేటట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. దీంతో మల్టీ స్టారర్ లో సినిమా వస్తుందా అంటూ పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తునట్లు సినీ ప్రముఖులు చెబుతున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన వీ చిత్రంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. దీనిపై భరీ అంచనాలతో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
సినిమా స్టోరి ఎలాగున్న సుధీర్ బాబు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. అందులో సుధీర్ యాక్టింగ్ సూపర్ అంటూ అభిమానులు తెగ సంబుర పడ్డారు. ఇక సుధీర్ బాబు నటించబోతున్న కొత్త చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ . ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవనుంది. ఇక ఈ హీరో మళ్లీ అభిమానులను మెప్పిస్తారో లేదో వేచి చూడాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాటలో ఇప్పుడు సుధీర్ బాబు నటిస్తున్నాడన్న విషయం హాట్ టాపిగ్ గా మారింది. అయితే ఈ చిత్రంలో ఏ రోల్ లో కనిపించబోతున్నాడన్నది ఇప్పడు సస్పెన్స్ గా మారింది. అయితే సుధీర్ బాబు ఎప్పటినుంచో సూపర్ స్టార్ తో నటించాలని అనుకుంటున్నాడట. అది ఇప్పుడు నిరవేరబోతుంది. అయితే సినిమాలో వీరిద్దరూ ఎలా ఉంటారో అని వాళ్ల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.