కొత్త ఏడాది రోజున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఫ్యానుకి ఉరి వేసుకుని ఆమె తనువు చాలించింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలోని అనుప్షహర్ కు చెందిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అర్జూ పవార్ ఎస్సైగా పనిచేస్తోంది. ఆమెకు 30 ఏళ్ల వయస్సు.
ఇటీవల అర్జూ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. అర్జూ పవార్, ఆమె అద్దెకు ఉంటున్న ఇంటిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. అర్జూ అలికిడి లేకపోవడంతో చాలా సేపటి తరువాత ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరచి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఇంటి యజమానురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు పంచనామా నిర్వహించారు.
ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పోలీసులకు ఘటనాస్థలంలో ఓ సూసైడ్నోట్ లభించింది. అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆమె తన సూసైడ్ నోట్ లో తన చావుకు తానే కారణమని పేర్కొందని పోలీసులు వెల్లడించారు.
అర్జూ పవార్ స్వస్థలం షామ్లీ పట్టణం. ఆమె 2015 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ. ఘటనా స్థలం లో ఉన్న పోలీసులు అర్జూ చనిపోయిన రూంను వీడియో తీశారు. పోలీసులు ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్దారించారు. పోలీసులు శోధించగా అర్జూ రూంలో వాళ్ళకి ఒక సూసైడ్ నోట్ లభించింది. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని మరియు తన పనుల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన నోట్లో పేర్కొంది. అయితే ఆమె కుటుంబ సభ్యులతో పాటుగా ఆమె స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.