Sujana Chowdary : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని బీజేపీ పార్టీ నేత సుజనా చౌదరి మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ మౌలికసదుపాయాలు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతసేపు వైసీపీ పార్టీ నేతలు ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం పాటు పడటం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా చేస్తున్నారని ప్రజలపై నేను భారం మోపుతున్నారని ఏపీ భవిష్యత్తు తలచుకుంటే ఆందోళనకరంగా ఉంది అన్నట్టు కామెంట్లు చేశారు. ఎన్నో సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టిన జగన్ ఒక్క రూపాయి కూడా ఇక్కడి నుండి తీసుకెళ్లలేదని సెటైర్లు వేశారు.
Sujana Chowdary : జగన్ ఢిల్లీ ఎందుకు వస్తున్నారు
అసలు జగన్ ఢిల్లీ ఎందుకు వస్తున్నారా ఎవరికి అర్థం కావటం లేదు అని అనుమానం వ్యక్తం చేశారు. మహమ్మారి దెబ్బకి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయితే కేంద్రం వాటన్నిటినీ అధిగమించి 2021 బడ్జెట్ ప్రవేశ పెట్టడం చాలా గొప్పగా ఉందని.. తాజా బడ్జెట్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ప్రత్యేక హోదా గురించి వైసీపీ నేతలు మాట్లాడటం దారుణమని, అది ముగిసిపోయిన అధ్యాయం అని సుజనా చౌదరి స్పష్టం చేశారు. చంద్రబాబు జగన్ ప్రధాని పీఠం లో కూర్చున్న గాని ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే ఛాన్స్ లేదని తెగేసి చెప్పేశారు. దానికి బదులు రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రాన్ని అడిగి తీసుకెళితే బాగుంటుందని సూచించారు. ఇక పోలవరం విషయంలో కూడా చంద్రబాబు మరియు వైయస్ జగన్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.