Pushpa: నిన్నటి వారం శుక్రవారం నాడు రిలీజైన పుష్ప గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్షాఫీస్ కొల్లగొడుతుంది. టాక్ విషయంలో కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ బాక్షాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా రివ్యూస్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. అందులోనూ సుకుమార్ దీనికి డైరెక్ట్ కావడంతో కొంచెం అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషనల్ లో భాగంగా ‘కేజీయఫ్’తో పోల్చడం జరిగింది.
Pushpa: అప్పుడే ‘పుష్ప’ పార్ట్-2ని లైన్ లో పెట్టేసిన సుకుమార్!
‘కేజీయఫ్’తో ఎవరు పోల్చారు?
మనకు తెలిసిందే. సుకుమార్ శిష్యుడు ఐనటువంటి బుచ్చిబాబు ఈ ఆడియో ఫంక్షన్ వేదికగా ‘ఒక పుష్ప 10 కేజీయఫ్ లతో సమానం’ అని చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేసి పారేసాడు. దాంతో ఈ సినిమాపైన కొంచెం భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘పుష్ప’ ‘కేజీయఫ్-1’ స్థాయిలో లేదని ప్రేక్షకులు పెదవి విరిచేసారు. టెక్నికల్ గా సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ సగటు మాస్ ఆడియన్ దీన్ని జీర్ణించుకోలేక పోయాడు.
Pushpa: పార్ట్ 2 మీద సంచలన వ్యాఖ్యలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్..
దీనికి సుకుమార్ స్పందన?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన సుకుమార్ “ఓ కొత్త ఫార్మాట్ లో ఉన్న కమర్షియల్ సినిమా ఇది. దయచేసి దీన్ని దేనితోనూ పోల్చకూడదు. సెకండ్ పార్ట్ కనెక్షన్స్ కోసం చేసిన కొన్ని సన్నివేశాలు కొంచెం ల్యాగ్ అనిపించొచ్చు. కానీ మిగతాదంతా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. దయచేసి దీన్ని కెజిఫ్ తో పోల్చకండి.” అని కొంచెం ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక మెయిన్ స్టోరీ అంతా ‘పుష్ప-2’ లోనే ఉంటుంది. అది ఖచ్చితంగా పరీక్షకులను నిరాశ పరచదు అని అన్నారు.